By - Subba Reddy |3 May 2023 8:45 AM GMT
కల్లుకు బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చింది తెలంగాణ సర్కార్. గీత కార్మికుల అస్తిత్వానికి ప్రతీకగా కల్లుకు బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చి.. దీన్నో పరిశ్రమ స్థాయికి తీసుకురావాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం నీరా కేఫ్ ను ప్రారంభించింది. 20 కోట్ల రూపాయలతో నిర్మించిన నీరా కేఫ్ను మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. నెక్లెస్ రోడ్డులో 2020 జులై 23న దీనికి శంకుస్థాపన చేశారు. తాటి, ఈత చెట్ల నుంచి సేకరించిన నీరాను ఇక్కడ అమ్మనున్నారు. ఒకేసారి 500 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. పల్లెల్లో ఉండే వాతావరణం కాన్సెప్ట్ తో నిర్మించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com