By - Chitralekha |9 May 2023 9:51 AM GMT
మధ్యప్రదేశ్లోని ఖర్గోన్లో చోటుచేసుకున్న బస్సు ప్రమాదంలో 15 మంది మృతి చెందగా, దాదాపు 25 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ఇండోర్కు వెళ్తున్న బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి పడిపోయింది. ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం మృతుల కుటుంబ సభ్యులకు 4 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు, క్షతగాత్రులకు రూ.25 వేలు ప్రకటించింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com