స్మశానం కబ్జా

స్మశానం కబ్జా

కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో స్మశానం కబ్జాకు గురైంది. వెదురు పావులూరు రెవెన్యూ పరిధిలోని ఆర్‌ఎస్‌ నెంబర్‌ 468/2లో 12 సెంట్లలో బొబ్బ వంశస్థులు తమ కుటుంబీకుల సమాధుల కోసం స్థలం వదులుకున్నారు. అధికార పార్టీకి చెందిన నేతలు నకిలీ దస్తావేజులతో ఆ స్థలాన్ని కబ్జా చేశారు. సమాధులకు కూలగొట్టి అందులో అక్రమ వెంచర్ వేస్తున్నారు. స్థానిక కోర్టు నుంచి ఇంజెక్షన్‌ ఆర్డర్‌ ఉన్నా పనులు ఆపడం లేదని.. హైకోర్టులోనూ కేసు పెండింగ్‌లో ఉందని వంశస్థులు చెబుతున్నారు. ఫిర్యాదు చేయబోతే పీఎస్‌కు పిలిపించి బెదిరించారని వాపోతున్నారు.

Next Story