వైద్యుల నిర్లక్ష్యం, గర్భిణి మృతి

వైద్యుల నిర్లక్ష్యం, గర్భిణి మృతి

మహబూబాబాద్‌ జల్లా మరిపెడలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల నిండు గర్భిణి మృతి చెందింది. వడ్డూరి భాగ్యలక్ష్మికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకొచ్చారు. అక్కడ వైద్యులు ఆపరేషన్‌ చేసి కాన్పు చేశారు. కానీ, తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడికి చేరుకునే సరికే భాగ్యలక్ష్మి చనిపోయిందని నిర్ధారించారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే భాగ్యలక్ష్మి మృతి చెందిందని బంధువులు, కుటుంబసభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. కారకులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Next Story