నిప్పులు కొలిమిలా మారిన తెలుగు రాష్ట్రాలు

నిప్పులు కొలిమిలా మారిన తెలుగు రాష్ట్రాలు

రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్న ఉష్ణోగ్రతలతో ఏపీ, తెలంగాణ నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. నిన్న హైదరాబాద్‌, రాజమండ్రిలో రికార్డుస్థాయిలోఒ 49 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ పలు జిల్లాల్లోను 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. రాజమండ్రిలో అత్యధికంగా 49 డిగ్రీలు, ఏలూరులో 48, భీమవరంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు తెలంగాణలోని మిర్యాలగూడ 47, పాల్వంచలో 46 డిగ్రీలు, వరంగల్‌, నల్గొండలలో 43, జగిత్యాలలో 44, కొత్తగూడెంలో 46 డిగ్రీలు, ఖమ్మం జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Next Story