By - Vijayanand |8 Aug 2023 7:13 AM GMT
ఇవాళ విజయవాడలో విద్యుత్ ఉద్యోగులు మహాధర్నాకు పిలుపునివ్వడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మహాధర్నాకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. నిబంధనలు అతిక్రమిస్తే ఎస్మా చట్టం ప్రయోగిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. మరోవైపు విజయవాడలో 144 సెక్షన్ అమలు చేస్తోంది. అయితే మహాధర్నా విరమించుకున్నామని ఇప్పటికే విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. ఇవాళ వర్క్ టు రూల్ పాటించాలని ఉద్యోగులకు పిలుపునిచ్చింది. అయినా విజయవాడలో భారీగా పోలీసులను మోహరించారు. అటు విద్యుత్ సౌధ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం విద్యుత్ సౌధ పూర్తిగా పోలీసులు నిఘా నీడలో ఉంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com