Machilipatnam: ఇంజెక్షన్‌ వికటించి.. ఏడుగురు చిన్నారులకు అస్వస్థత

Machilipatnam: ఇంజెక్షన్‌ వికటించి.. ఏడుగురు చిన్నారులకు అస్వస్థత

కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రి పిల్లల విభాగంలో ఇంజక్షన్ వికటించి ఏడుగురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పిల్లల విభాగంలో వైద్యం పొందుతున్న చిన్నారులకు...శుక్రవారం రాత్రి ఆస్పత్రి సిబ్బంది ఇంజక్షన్ చేశారు. ఇంజక్షన్ చేసిన అర గంటకు చిన్నారులకు విపరీతమైన చలి, జ్వరం రావడాన్ని గమనించి వైద్యులు అప్రమత్తమయ్యారు. ఇంజక్షన్ చేసిన వారిలో ఏడుగురు పిల్లలకు అస్వస్థతగా ఉండటంతో వారిని ఇంటెన్సివ్ కేర్ కు తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. పిల్లల విభాగంలోని మొత్తం 15 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న చిన్నారులకు రోజూ మాదిరిగానే శుక్రవారం రాత్రి ఇంజక్షన్ చేశారు. ఇంజక్షన్ చేసిన అర గంట తర్వాత విపరీతమైన చలి, జ్వరం రావడాన్ని గమనించి వైద్యులు అప్రమత్తమయ్యారు. ఇంజక్షన్ చేసిన వారిలో ఏడుగురు పిల్లలకు అస్వస్థతగా ఉండడంతో వారిని ఇంటెన్సివ్ కేర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Next Story