By - Sathwik |28 Jun 2023 6:15 AM GMT
మహబూబాబాద్ జిల్లాలో భారీ రైలు త్రుటిలో ప్రమాదం తప్పింది. కేసముద్రం-ఇంటికన్నె స్టేషన్ల మధ్య విజయవాడ నుంచి కాజీపేట వెళ్తున్న గూడ్సు రైలు లింకు తెగిపోయింది. గూడ్స్ రైలు బోగీలు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్ శివారులో విడిపోయాయని అధికారులు తెలిపారు. రెండు బోగీలు గూడ్స్ నుంచి విడిపోయినట్లు గార్డ్ గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన గార్డ్... లోకో పైలెట్ కు సమాచారం అందించారు. కిలోమీటర్పైగా ముందుకు వెళ్లి మళ్ళీ ట్రైన్ వెనక్కి వచ్చి భోగి తగిలించుకొని వెళ్ళింది. గార్డు అప్రమత్తంగా ఉండటం... విడిపోయిన బోగీలు పట్టాలు తప్పకపోవడంతో భారీ ప్రమాదం తప్పినట్లైంది. విడిపోయిన బోగీలు పట్టాలు తప్పకపోవడంతో రైల్వే అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com