LION: తిరుపతి జూపార్క్‌లో వ్యక్తిని చంపేసిన సింహం

LION: తిరుపతి జూపార్క్‌లో వ్యక్తిని చంపేసిన సింహం

తిరుపతి ఎస్వీ జంతుప్రదర్శనశాలలో విషాదం చోటు చేసుకుంది. రాజస్థాన్ కు చెందిన సందర్శకుడు సింహం బారిన పడి ప్రాణాలు కొల్పోయాడు. మధ్యాహ్నం రెండున్నర సమయంలో రాజస్ధాన్ కు చెందిన ప్రహ్లద్‍ గుర్జర్‍ అనే వ్యక్తి.. అక్కడి సిబ్బంది వారిస్తున్నా లయన్‍ ఎన్‍ క్లోజర్ లోకి దూకాడు. సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి అతడిని కాపాడేందుకు ప్రయత్నించారు. ఈలోపే ఎన్‍ క్లోజర్ లో ఉన్న మగ సింహం దాడి చేయడంతో..సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహం వద్ద లభించిన ఆధారాల మేరకు అతని కుటుంబసభ్యులకు...... సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహన్ని ఆస్పత్రికి తరలించారు.

Next Story