అదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో గ్రామస్తుల ఆందోళన

అదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో గ్రామస్తుల ఆందోళన

అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై దుబార్‌ పేట గ్రామస్థులు బైఠాయించి నిరసనకు దిగారు. ప్రతి సంవత్సరం గ్రామంలోకి వర్షపు నీరు చేరుతున్నా శాశ్వత పరిష్కారం చూపడం లేదని మండిపడుతున్నారు. గ్రామంలోకి వరద నీరు రాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ వచ్చే వరకు నిరసన విరమించేది లేదని రోడ్డుపై బైఠాయించారు. గ్రామస్థుల ఆందోళనతో జాతీయరహదారిపై కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి

Next Story