హైదరాబాద్‌ చేరుకున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి

హైదరాబాద్‌ చేరుకున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ.వేణుగోపాల్ హైదరాబాద్‌ కు చేరుకున్నారు. ఆయనకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ లో ఘనంగా స్వాగతం పలికారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్‌చార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్. గాంధీభవన్‌లో పార్లమెంట్ ఇన్‌చార్జీలతో ఆయన సమావేశం అయ్యారు.సాయంత్రం మూడు గంటలకు జరిగే పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ తో భేటీ కానున్నారు కేసీ వేణుగోపాల్.మరోవైపు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా గాంధీభవన్‌కు రానున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా భారీ ర్యాలీతో గాంధీభవన్‌ చేరుకోనున్నారు.

Next Story