Amaravathi: అమరావతిపై నేడు సుప్రీం విచారణ

Amaravathi: అమరావతిపై నేడు సుప్రీం విచారణ

అమరావతి రాజధాని వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.ఏపీ ప్రభుత్వం, రైతులు, అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు సమాఖ్యలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేయనుంది. రాజధానిపై దాఖలైన పిటిషన్లను జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం విచారించనుంది. గతంలో ఈ పిటిషన్లను జస్టిస్ జోసెఫ్ విచారించారు. ఆయన పదవీ విరమణ చేయడంతో జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం అమరావతి కేసులను విచారించనుంది.

Next Story