నేడు సుప్రీంకోర్టులో ఆర్‌5 జోన్ కేసు విచారణ

నేడు  సుప్రీంకోర్టులో ఆర్‌5 జోన్ కేసు విచారణ

అమరావతిలోని ఆర్‌5 జోన్ కేసు విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు ధర్మాసనం. అమరావతి రాజధాని కేసును విచారిస్తున్న జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనమే.. ఆర్‌5 జోన్ కేసును విచారించనుంది. పిటిషన్‌పై విచారణ మధ్నాహ్నం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కేసులో నిర్ణయం తీసుకునే ముందు తమ వాదనలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని అమరావతి రైతులు కేవియట్ దాఖలు చేశారు. అటు ఏపీ ప్రభుత్వం కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఆర్‌5జోన్‌పై హైకోర్టు తీర్పును సవాల్ చేసింది.

Next Story