అమ్మఒడి పథకం.. తల్లుల ఖాతాలో జమకాని వైనం

అమ్మఒడి పథకం.. తల్లుల ఖాతాలో జమకాని వైనం

అమ్మఒడి పథకం నాలుగో విడత డబ్బు ఇప్పటికీ తల్లుల ఖాతాలో జమ కాలేదు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో సీఎం జగన్‌ జూన్‌ 28న బటన్‌ నొక్కారు. 42.61 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 6 వేల 392 కోట్లు జమ చేస్తున్నట్లు సీఎం గొప్పగా ప్రకటించారు. బటన్‌ నొక్కి 15 రోజులైన ఇప్పటికీ 40 శాతం మందికి నిధులు జమ కాలేదు. అమ్మఒడి సాయం 15 వేల రూపాయలల్లో పాఠశాల, మరుగుదొడ్ల నిర్వహణకు 2 వేల రూపాయలు మినహాయిస్తున్నారు. మిగతా 13 వేలైనా వస్తాయా అని ఎదురుచూస్తున్నారు లబ్ధిదారులు. డబ్బులు పడ్డాయోమోనని తల్లులు బ్యాంకులకు వెళ్లి చూసుకుంటున్నారు. డబ్బులు పడకపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Next Story