వైసీపీ పాలనలో నిధులు పక్కదారి

వైసీపీ పాలనలో నిధులు పక్కదారి

నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలోకేంద్రం నుంచి వచ్చిన 71వేల4వందల49 కోట్ల నిధులు పక్కదారి పట్టాయని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కేంద్ర నిధులకు Y.S.R, జగన్ పేర్లను పెట్టడంపై కేంద్రం అభ్యంతరం తెలిపిందన్నారు. పేర్ల విషయంలో జగన్ ప్రభుత్వ తీరు మారకపోవటంతో ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన 6 వేల కోట్లను కేంద్రం నిలిపేసిందన్న యనమల పేర్ల కోసం జగన్ పేదలను బలి చేస్తున్నారని దుయ్యబట్టారు. 75 పథకాలకు జగన్, Y.S.R పేర్లు పెట్టడం...రాచరిక పోకడ కాదా..? అని నిలదీశారు. 94 కేంద్ర పథకాలకు జగన్ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల...B.C వర్గాలు అభివృద్ధికి దూరమయ్యాయని ఆరోపించారు. వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, స్ఖానిక సంస్థలకు రావాల్సిన నిధులను పక్కదారి పట్టించారన్నారు. పేదల గృహ నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన 3వేల84 కోట్లని దారి మళ్లించారని యనమల ఆక్షేపించారు. రైతులకివ్వాలని కేంద్రం ఇచ్చిన కరవు సాయం 900 వందల కోట్లు...రైతులకు చేరలేదన్నారు. 8వేల 6వందల 60 కోట్ల మేర స్థానిక సంస్థల నిధులు రాష్ట్ర ప్రభుత్వం...పక్కదారి పట్టించిందని మండిపడ్డారు. ఉపాధి హామీ కూలీలకు చెందాల్సిన 7వేల 8వందల 79 కోట్లను దారి మళ్లించి, వలసలకు జగన్ ప్రభుత్వం కారణమవుతోందని యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు.

Next Story