AP HC: చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై విచారణ

AP HC: చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై విచారణ

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 22కి వాయిదా వేసింది. ఈ కేసులో C.I.D అధికారులు గతంలో ACB కోర్టులో P.T. వారెంట్ దాఖలు చేశారు. P.T.వారెంట్ పై దిగువ కోర్టులో విచారణ తాత్కాలికంగా నిలిపివేయాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్ పై ఉత్తర్వులు పెండింగ్ లో ఉన్నాయని... 17A రింగ్ రోడ్డు కేసుకు కూడా వర్తిస్తుందని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఉచిత ఇసుక పథకంపై సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై కేసు నమోదు చేయటం సరికాదని పిటిషన్ లో పేర్కొన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న ఇసుక పాలసీ కారణంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం వాటిల్లిందని A.P.M.D.C డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. రేపు హైకోర్టులో పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Next Story