By - Vijayanand |4 July 2023 12:14 PM GMT
గత నెల 28న సీఎం జగన్ ఏపీలో అమ్మఒడి బటన్ నొక్కారు. కానీ ఇప్పటి వరకు సొమ్ములు తల్లుల అకౌంట్లలో పడలేదు. నిన్నటికి కొంత మంది అకౌంట్లలో పడినా... ఇంకా చాలా మందికి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. లబ్దిదారులు తమకు ఇంకా అమ్మఒడి పడలేదంటూ.. వాలంటీర్లకు ఫోన్లు చేస్తున్నారు. ఈకేవైసీ పూర్తైన వారికి ఈ నెల 7న పడతాయంటూ సమాధానం వస్తోంది. నిధుల సమస్య కారణంగానే అమ్మ ఒడి పడటం లేదంటున్నారు. నిధులు సర్ధుబాటు కాకపోతే.. మరింత సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com