ప్రజలను తాకట్టు పెట్టి 5 లక్షల కోట్లు అప్పు- భట్టి

ప్రజలను తాకట్టు పెట్టి 5 లక్షల కోట్లు అప్పు- భట్టి

తెలంగాణ వచ్చిన పది సంవత్సరాల్లో రాష్ట్రం సాధించింది ఏమీ లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి 5 లక్షల కోట్లు అప్పు తెచ్చి ప్రజలపై భారం మోపిందని విమర్శించారు. మధిరలోని క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తాను చెపట్టిన పీపుల్స్ మార్చ్‌ పాదయాత్ర వల్లే రాష్ట్రంలో ఇళ్లు, పెన్షన్లు, దళిత బంధు ఇస్తున్నారని తెలిపారు. రైతులకు సంబంధించిన అన్ని సబ్సిడీలను ఎత్తివేయడం జరిగిందని భట్టి విమర్శించారు.

Next Story