By - Bhoopathi |29 Jun 2023 7:45 AM GMT
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని తెల్లగుండ్ల పల్లెలో వైసీపీ ఎమ్మెల్యే బాబుకు చేదు అనుభవం ఎదురైంది. నాలుగేళ్లలో ఏం అభివృద్ధి చేశారు? గ్రామానికి ఎందుకు వస్తున్నారంటూ? తెల్లగుండ్లపల్లెకి చెందిన ప్రజలు బ్యానర్ ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు బ్యానర్ తొలగించాలని ప్రజల్ని ఆదేశించారు. దీంతో పోలీసులు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్న వైసీపీ ఎమ్మెల్యే బాబుకి ఇప్పటికే పలు చోట్ల నిరసనలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com