అసెంబ్లీ సమావేశాలకు భాజాపా సన్నధం

అసెంబ్లీ సమావేశాలకు భాజాపా సన్నధం

అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష బీజేపీ సిద్ధమవుతోంది. ప్రజా సమస్యలపై సభలో చర్చకు పట్టుబట్టాలని నిర్ణయించింది. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో అమలు చేయని హామీలను ప్రస్తావించాలని నిర్ణయించారు. రైతు రుణమాఫీ, రేషన్‌కార్డులు, దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ అంశాలను సభలో ప్రస్తావించనున్నారు. సస్పెన్షన్‌కు గురికాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని డిసైడ్ అయ్యారు. సభలో ఉంటే మాట్లాడేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై చేసే విమర్శలకు ధీటుగా కౌంటర్‌ ఇచ్చేలా కమలం పార్టీ రెడీ అవుతోంది.

Next Story