రాష్ట్రాన్ని కేసీఆర్​ అప్పులపాలు చేస్తున్నారు- డీకే అరుణ

రాష్ట్రాన్ని కేసీఆర్​ అప్పులపాలు చేస్తున్నారు- డీకే అరుణ

బీఆర్ఎస్​ప్రజాప్రతినిధులందరికీ రాజకీయ పిచ్చి పట్టుకుందని పబ్లిక్​ సమస్యలు పరిష్కరించడం చేతకావట్లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండి పడ్డారు. రాష్ట్రాన్ని కేసీఆర్​ అప్పులపాలు చేస్తున్నా, మహిళలపై దాడులు జరుగుతున్నా ప్రశ్నించాల్సిన అధికారులు బీఆర్ఎస్​ నేతలకు వంత పడుతుండటం బాధాకరమని అన్నారు. బీఆర్ఎస్​ ప్రకటించిన ఎమ్మెల్యేల అభ్యర్థులపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ వారికే తిరిగి టికెట్టు కేటాయించడం ఏంటని ఆమె ప్రశ్నించారు.

Next Story