By - Chitralekha |8 Aug 2023 11:23 AM GMT
కేసీఆర్ సర్కారు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తీరును బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తప్పుబట్టారు. ఏడాదిలో కేవలం 14 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కనీసం 60 రోజుల పాటు సభను నిర్వహించేవారని గుర్తుచేశారు. అంశాలపై చర్చించకుండా, ప్రశ్నలకు అధికారపక్షం సమాధానం చెప్పకుండా వెకిలి మాటలతో అవమానపరుస్తున్నారని ఆరోపించారు. బీఏసీ సమావేశానికి బీజేపీని పిలవకుండా స్పీకర్ అవమాన పరిచారన్న ఆయన.. సభను నడుపుతున్న తీరు, బీజేపీకి సమయం ఇవ్వకపోవడాన్ని తప్పబట్టారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com