CBN: చంద్రబాబు పాదాలను రక్తంతో కడిగిన బుద్దా వెంకన్న

CBN: చంద్రబాబు పాదాలను రక్తంతో కడిగిన బుద్దా వెంకన్న

తెలుగుదేశం అధినేత చంద్రబాబు తనకు టిక్కెట్ ఇవ్వకున్నా తాను వ్యతిరేకించబోనని ఆ పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. ఇన్నాళ్లు... తనను తప్పించేందుకు కేశినేని నాని తెగ ప్రయత్నించినట్టు చెప్పారు. మొదటి కేశినేని నాని తనను లక్ష్యం చేసుకుని పనిచేశారని ఆరోపించారు.


ఏపీలోని 175 స్థానాల్లో... విజయవాడ పశ్చిమ సీటు ఒక్కటే పక్కన పెట్టి.... 174 స్థానాల్లో IVRSసర్వే చేపడుతున్నారన్న బుద్దా వెంకన్న.. ఇది తనకు బాధ కలిగించిందని తెలిపారు. రక్తం తీసి చంద్రబాబు చిత్ర పటానికి బుద్దా వెంకన్న కాళ్లు కడిగారు. సీబీఎన్ జిందాబాద్ అంటూ.. రక్తంతో గోడపై రాశారు. తన అభిమానాన్ని చాటుకునేందుకే ఇదంతా చేస్తున్నట్టు బుద్దావెంకన్న తెలిపారు.



Next Story