Anantapuram: జడ్జిపై కేసు పెట్టిన భార్య

Anantapuram: జడ్జిపై కేసు పెట్టిన భార్య

అనంతపురంలో జడ్జిపైన ఆయన భార్య కేసు నమోదు చేశారు. జిల్లా 8వ ఏడిజే ఎస్సీ,ఎస్టీ కోర్టు జడ్జిగా పనిచేస్తున్న డి. శ్రీనివాసులుపై ఆయన భార్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన భర్త తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారంటూ కంఫ్లైంట్‌ చేశారు. మ్యూచవల్ డైవర్స్ కి ఒప్పుకోవాలని వేధిస్తున్నారని ఆరోపించారు. జడ్జి సోదరుడు తనపై తీవ్ర ఒ‍త్తిడి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తన కూతురి భవిష్యత్తు కోసమే కలిసి ఉండాలనుకుంటున్నానని ఆమె తెలిపారు. తనకు న్యాయం చేయాలంటూ మహిళా సంఘాలతో కలసి ఎస్పీ ఆఫీస్‌కు వచ్చారు.

Next Story