AP: పంచాయతీల నిధుల మళ్లింపుపై కేంద్రం సీరియస్‌

ఏపీలో పంచాయతీల నిధుల మళ్లింపుపై విచారణకు కమిటీని నియమిస్తున్నట్టు కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కపిల్‌ మోరేశ్వర్‌ పటేల్‌ చెప్పారు. టీడీపీ ఎంపీలు కనకమేడల, రామ్మోహన్‌తో కలిసి ఏపీ సర్పంచ్‌ల సంఘ నేత వైవీబీ రాజేంద్రప్రసాద్‌, కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. పంచాయతీలకు ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులను ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కపిల్‌ మోరేశ్వర్‌ గ్రామపంచాయతీల కోసం ఇచ్చిన నిధులను గ్రామాల అభివృద్ధికే ఖర్చు చేయాలన్నారు. నిధుల మళ్లింపుపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని సర్పంచ్‌లకు హామీ ఇచ్చారు.

Next Story