CBN: చంద్రబాబు బెయిల్‌పై నేడు విచారణ

CBN: చంద్రబాబు బెయిల్‌పై నేడు విచారణ

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో బెయిల్‌ కోసం టీడీపీ చీఫ్‌ చంద్రబాబునాయుడు దాఖలు చేసిన ప్రధాన బెయిలు పిటిషన్‌పై నేడు ఆంధ్రప్రదేస్‌ హైకోర్టు విచారణ జరపనుంది. నిందితులందరూ ఇప్పటికే రెగ్యులర్‌, ముందస్తు బెయిలు పొందడం.. ఇదే కేసులో 37వ నిందితుడైన చంద్రబాబుకు మాత్రం బెయిలు దక్కకపోవడంపై న్యాయవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రధాన నిందితులు బెయిలు పొందాక మిగిలిన నిందితులకు బెయిలు దక్కడం సర్వసాధారణమని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ పూర్వ ఎండీ, మొదటి నిందితుడు గంటా సుబ్బారావుతో పాటు మిగిలిన నిందితులందరూ ఇప్పటికే బెయిలు పొందారు. స్కిల్‌ సంస్థ కేసులో చంద్రబాబు ఒక్కరికే బెయిలు రావాలని, ఇదే కేసులో ఆయన 52 రోజులు జ్యుడిషియల్‌ కస్టడీలో గడిపారని, మిగిలిన నిందితులెవరూ లేనంత కాలం చంద్రబాబు జైల్లో ఉన్నారు.

తన బెయిలు పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేయడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్య కారణాలతో హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. శుక్రవారం ప్రధాన బెయిలు పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో న్యాయవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Next Story