By - Vijayanand |8 Aug 2023 8:53 AM GMT
ఏపీలో పరిస్థితులపై మెగాస్టార్ చిరంజీవి హాట్ కామెంట్ చేశారు.వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్లో పాల్గొన్న చిరు..ఏపీ మంత్రి అంబటిపై చిరంజీవి పరోక్షంగా సెటైర్లు వేశారు.నేతలు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాలి,ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టుల గురించి ఆలోచించాలన్నారు. పేదల కడుపు నింపడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టిపెడితే అందరూ తలవంచి నమస్కరిస్తారని అన్నారు.అన్ని విషయాలు వదిలేసి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీపై పడతారేంటి? అంటూ కాస్త ఘాటుగానే అన్నారు.ఇదేదో పెద్ద సమస్యలా చూపించొద్దని విజ్ఞప్తి చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com