అసెంబ్లీ సమావేశాల్లో సర్కారును నిలదీస్తాం- భట్టి

అసెంబ్లీ సమావేశాల్లో సర్కారును నిలదీస్తాం- భట్టి

తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు ఏవీ నెరవేరలేదన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఢిల్లీలో ప్రసంగించిన ఆయన రేపట్నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సర్కారును నిలదీస్తామన్నారు. ఏ లక్ష్యాల కోసం రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో అవేవి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులను అశాస్త్రీయంగా కట్టడం వల్లే నీరు రాకపోగా.. వరదల తీవ్ర అధికంగా కనిపించిందన్నారు. ఇంజనీర్లు కాకుండా ప్రాజెక్ట్‌లకు సీఎం కేసీఆర్‌ డిజైన్స్ రూపొందించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు పక్కదారి పట్టించారంటూ మండిపడ్డారు.

Next Story