కొల్లూరు టౌన్‌షిప్‌ను ప్రారంభించిన CM KCR

కొల్లూరు టౌన్‌షిప్‌ను ప్రారంభించిన CM KCR

సంగారెడ్డి జిల్లా కొల్లూరులో నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్ రూమ్ టౌన్ షిప్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ టౌన్‌షిప్‌కు కేసీఆర్ నగర్ గా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఆరుగురు లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు అందించారు. 145 ఎకరాల విస్తీర్ణంలో 1432.50 కోట్ల రూపాయల వ్యయంతో ఒకే చోట 15, 600 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. G+9 నుంచి G+10, G+11 అంతస్తుల వరకు టౌన్ షిప్ నిర్మాణం పూర్తైంది. ఈ టౌన్‌షిప్‌లో మొత్తం 117 బ్లాక్‌లు, బ్లాక్ కి 2 లిఫ్ట్ ల చొప్పున మొత్తం 234 లిఫ్ట్ ల ఏర్పాటు చేశారు.

Next Story