Narayanguda: భార్యను హత్యచేసిన కాంగ్రెస్ నేత తనయుడు

Narayanguda: భార్యను హత్యచేసిన కాంగ్రెస్ నేత తనయుడు

నల్గొండకు చెందిన రాజకీయ నేత రంగసాయి రెడ్డి కుమారుడు వల్లభ్ రెడ్డిపై హత్య కేసు నమోదు అయ్యింది. భార్యను హత్య చేసినందుకు గానూ నిందితుడిపై సెక్షన్ 201, 302 కింద నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ హిమాయత్ నగర్‌లో నివాసం ఉంటోన్న వల్లబ్‌ రెడ్డి పెళ్లైన ఏడాదికి భార్యను హత్య చేసినట్లు తెలుస్తోంది. రాజకీయ పలుకుబడితో హత్య కేసు నుంచి తప్పించుకునేదుకు గుండెపోటుగా చిత్రీకరించాడు. అయితే పోస్టు మార్టం రిపోర్టులో వాస్తవాలు బయటకు రావడంతో నిందితుడిని కటకటాల్లోకి పంపారు.

Next Story