MEET: చంద్రబాబును కలిసిన షర్మిల

MEET: చంద్రబాబును కలిసిన షర్మిల

కాంగ్రెస్ నాయకురాలు Y.S.షర్మిల.... తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని టీడీపీ అధినేత నివాసానికి వెళ్లిన ఆమె తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. బాబుతో భేటీ అనంతరం మాట్లాడిన షర్మిల YSRతో ఆయనకున్న స్నేహబంధాన్ని గుర్తు చేసుకున్నారని చెప్పారు. ఈ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని... తన కుమారుడి పెళ్లికి చంద్రబాబును ఆహ్వానించేందుకు మాత్రమే వచ్చినట్లు తెలిపారు. రాజకీయాల్లో వ్యక్తిగతంగా కక్షలు ఉండకూడదన్న షర్మిల... తమ మధ్య రాజకీయంగా ఎలాంటి లావాదేవీలు ఉండబోమని స్పష్టం చేశారు.

Next Story