Hyderabad: గవర్నర్ తమిళిసైతో కాంగ్రెస్ నేతల భేటీ

Hyderabad: గవర్నర్ తమిళిసైతో కాంగ్రెస్ నేతల భేటీ

రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైతో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలతో జరిగిన నష్టాన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు భట్టి నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని గవర్నర్‌ను కోరారు. ఆదివాసీల సమస్యలపైన కూడా స్పందించాలని విన్నవించారు. సరికొత్త టెక్నాలజీ అందుబాటులో ఉన్నా వరదలను ఎదుర్కొవడంలో ప్రభుత్వం విఫలమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రకృతి విపత్తు అయినా అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం సమాయత్తం చేయలేకపోయిందని, వెంటనే బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు భట్టి.

Next Story