By - Chitralekha |23 Aug 2023 7:23 AM GMT
చేతిలోని గన్ మిస్ ఫైర్ కావడంతో గార్డ్ ఇంచార్జ్, హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. సూర్యాపేటకు చెందిన భూపతి శ్రీకాంత్ తెల్లవారుజామున విధులు ముగించుకొని నిద్రకు ఉపక్రమించే తరుణంలో చేతిలో ఉన్న గన్ మిస్ ఫైర్ అయ్యింది. దీంతో అతని తలలోకి బుల్లెట్ దూసుకు పోయింది. అలికిడికి లేచిన పోలీసులు తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కానీ, పరిస్థితి విషమించడంతో శ్రీకాంత్ మృతి చెందాడు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com