By - Chitralekha |24 July 2023 9:32 AM GMT
మద్యంమత్తులో ఓ యువకుడు హల్చల్ చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా నర్సారెడ్డిలో చోటుచేసుకుంది. తాగిన మైకంలో యువకుడు శ్రీకాంత్ ఓ కుటుంబంపై దాడి చేశాడు. దంపతుల ముఖంపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. అడ్డుకోబోయిన బాలికను తిడుతూ విచక్షణారహితంగా దాడి చేశాడు. రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్ళాడు. కారు అద్దాలను కూడా ధ్వంసం చేశాడు. దీంతో నార్సింగి పోలీసులను ఆశ్రయించారు బాధితులు. కులం పేరుతో పాటు తమపై యువకుడు శ్రీకాంత్ దాడి చేశాడంటూ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com