బీఏసీ సమావేశంపై ఈటల అసంతృప్తి

బీఏసీ సమావేశంపై ఈటల అసంతృప్తి

బీఏసీ సమావేశంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఒక్క సభ్యుడు ఉన్నా బీఏసీకి పిలిచేవారని, ఇప్పుడు ముగ్గురు సభ్యులు ఉన్నా పిలువలేదని అన్నారు. అసెంబ్లీలో చాలా గదులు ఖాళీగా ఉన్నా తమకు రూమ్ కేటాయించలేదని, స్పీకర్ కు ఫోన్ చేసి అడిగినా సమాధానం లేదన్నారు. మరోవైపు సభ మూడు రోజులే జరుగుతుందని అంటున్నారని అయితే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయని వాటిని సభలో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు ఈటల.

Next Story