JANASENA: గాజు గ్లాస్‌ గుర్తు జనసేనకే

JANASENA: గాజు గ్లాస్‌ గుర్తు జనసేనకే

జనసేన గాజు గ్లాస్‌ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసిందనే వార్తలకు చెక్‌ పడింది. గాజు గ్లాస్ గుర్తును జనసేన పార్టీకే కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా మరోసారి గ్లాస్‌ను కేటాయించినందుకు ఎన్నికల సంఘానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలని జనసేన పార్టీ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జరిగిన గత సార్వత్రిక ఎన్నికలలో జనసేన అభ్యర్థులు గ్లాస్ గుర్తుపైనే పోటీ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో జనసేన మళ్లీ పోటీకి సిద్ధమైంది.


రిజిస్టర్డ్ పార్టీ అయిన జనసేనకు గ్లాస్ గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై ఆ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. జనసేన పార్టీ తరఫున పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. జ‌న‌సేన గాజు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కొంత కాలం కింద ర‌ద్దు చేసింది. ఇక పార్టీకి గుర్తు ఉండబోదంటూ ప్రచారం కూడా జరిగింది. కానీ కేంద్ర ఎన్నికల సంఘం పార్టీకి అదే గుర్తును కేటాయించి ఈ ప్రచారానికి చెక్ పెట్టింది

Next Story