వైసీపీపై మాజీ మంత్రి బండారు సంచలన వ్యాఖ్యలు

వైసీపీపై మాజీ మంత్రి బండారు సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అధికార వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. టీడీపీ సిద్దాంతాల పట్ల ఎవరైతే విశ్వాసంతో ఉన్నారో, స్థానిక నాయకత్వం ఎవరిని అంగీకరిస్తుందో వాళ్ళనే చంద్రబాబు పార్టీలోకి చేర్చుకుంటారని తెలిపారు. జగన్ చర్యలతో వైసీపీ కార్యక్తలు సిగ్గుపడుతున్నారని, సర్పంచ్‌లు చెప్పుతో కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికలు ముగిసిన తర్వాత జగన్‌కు చిప్పకూడు తప్పదని తప్పదని జోస్యం చెప్పారు.

Next Story