By - Chitralekha |19 Aug 2023 10:49 AM GMT
శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అర్చకులకు, ఆలయ ఈవో కు మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈవో శ్రీనివాసరెడ్డి తమను అవమానించారని అర్చకులు ఆరోపిస్తున్నారు. చైర్మన్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఆలయ ట్రస్టు బోర్డు సమావేశానికి వంశపారంపర్య అర్చకుడు పార్థసారధి ఆచార్యులు హాజరుకావాల్సి ఉంది. కానీ శ్రావణమాసం నేపథ్యంలో తన వారసుడు ఏడీ అంజన్ కుమార్ ఆచార్యులను సమావేశానికి పంపించారు. దీనిపై ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి నీవెందుకు వచ్చావని మండిపడ్డారు. అంజన్ కుమార్ సైతం తాను వంశపారంపర్య అర్చకుడునని వాదించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com