టూరిస్ట్ రైలులో పేలిన సిలిండర్.. 9 మంది మృతి

టూరిస్ట్ రైలులో పేలిన సిలిండర్.. 9 మంది మృతి

మదురై రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మృతి చెందారు. మరో 20మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మంటల్లో ఒకరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. లక్నో-రామేశ్వరం టూరిస్ట్ రైలులో సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్యాంట్రీ బోగిలో సిలిండర్ పేలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. రైలు బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఐఆర్టీసీ స్పెషల్ ట్రైన్ లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Next Story