భద్రాచలం వద్ద గోదావరికి తగ్గిన వరద ఉధృతి

భద్రాచలం వద్ద గోదావరికి తగ్గిన వరద ఉధృతి

భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి తగ్గింది. ఎగువ నుంచి గోదావరిలోకి క్రమంగా వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. నిన్న 43 అడుగులకు నీటిమట్టం చేరుకోగా సాయంత్రానికి 42 అడుగులకు దిగువకు చేరుకుంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఎత్తేసారు. ప్రస్తుతం 39.5 అడుగుల వద్ద వరద ప్రవాహం ఉంది. ఈ సాయంత్రానికి గోదావరి నీటిమట్టం 35 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు తాలిపేరు ప్రాజెక్టు నుంచి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.

Next Story