By - Chitralekha |22 Aug 2023 7:26 AM GMT
శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో ఎలుగుబంట్లు హల్చల్ చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ.. మల్లెనవారిపేట వాసులను భయపెడుతున్నాయి. ఉదయం గ్రామశివారుల్లోని కొండల్లో ఉంటూ.. రాత్రి వేళ గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. దొరికిన ఆహారం తింటూ రోడ్లపై తిరుగుతున్నాయి. వాటిని చూసి గ్రామస్తులు హడలిపోతున్నారు. రాత్రి వేళ ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు మల్లెనవారి పేట వాసులు భపడుతున్నారు. తక్షణమే అటవీశాఖ అధికారులు స్పందించాలని కోరుతున్నారు. ఎలుగుబంట్లను బంధించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com