ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో భీకర వర్షం

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో భీకర వర్షం

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో భీకర వర్షం పడుతుంది. భోదాపురం వద్ద జిన్నెల వాగు ఉగ్రరూపం దాల్చింది. దీంతో సీతారాంపురం గిరిజన పల్లెల్ని వరదలు చుట్టుముట్టాయి. వాగు దాటే పరిస్థితి లేక గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు అన్నదమ్ములకు విరోచనాలు, వాంతులు మొదలయ్యాయి. ఆస్పత్రికి తీసుకువెళ్లే పరిస్థితి లేకపోవడంతో అన్న చనిపోయాడు. తమ్ముడు కురుసం లక్ష్మయ్యది అదే పరిస్థితి కావడంతో డోలీలో అతడిని అతికష్టంమీద జిన్నెల వాగును దాటించారు. ప్రస్తుతం లక్ష్మయ్య వెంకటాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Next Story