KTR: ప్రతిపక్ష పార్టీగా తమ తొలి విజయం అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్--

KTR:   ప్రతిపక్ష పార్టీగా తమ  తొలి విజయం అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్--

బీఆర్‌ఎస్‌ ఒత్తిడితోనే కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించట్లేదని అసెంబ్లీలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెడుతున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికరంగా స్పందించారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పడానికి నిరసనగా రేపు నల్లగొండలో బీఆర్‌ఎస్‌ తలపెట్టిన ‘చలో నల్లగొండ’ సభ వల్లే కాంగ్రెస్‌లో చలనం వచ్చిందని తెలిపారు. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్‌కు దక్కిన మొదటి విజయంగా భావిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్‌ లో కేటీఆర్‌ పోస్ట్‌ చేశారు.కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడానికి నిరసనగా మంగళవారం నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన 'ఛలో నల్గొండ' సభ సృష్టించిన ఒత్తిడి కారణంగానే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Next Story