By - Chitralekha |24 July 2023 10:27 AM GMT
రాజధాని అమరావతిలో సీఎం జగన్ ఇళ్ల పట్టాలు ఇచ్చింది పేదలకు కాదన్నారు జనసేన నేత పోతిన మహేష్. వైసీపీ నాయకులు, వాలంటీర్లకు మాత్రమే రాజధానిలో సెంటు స్థలాలు ఇచ్చారని ఆరోపించారు. వైసీపీ నాయకుల మాయమాటలను నమ్మేస్థితిలో విజయవాడ జనం లేరన్నారు. సెంటు భూమి పథకంతో ప్రజలను మోసం చేస్తూ.. జక్కంపూడిలోని టిడ్కో ఇళ్లకు గ్రహణం పట్టించారని విమర్శించారు. 80 శాతం కట్టిన ఇళ్లను కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందన్నారు. నాలుగు ప్యాలెస్లు ఉన్న జగన్ పెత్తందారు కాదు.. నిరుపేద అంటూ సెటైర్ వేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com