అనంతపురంలో జనసేన, వామపక్షాల నేతల ఆందోళన

అనంతపురంలో జనసేన, వామపక్షాల నేతల ఆందోళన

అనంత సెబ్ సిబ్బందిపై వైసీపీ దాడి చేయడం సంచలనంగా మారింది. వైసీపీ దాడులను నిరసిస్తూ.. అనంతపురంలో జనసేన, వామపక్షాల నేతలు ఆందోళనకు దిగారు. సెబ్ సిబ్బందిపై దాడి చేసిన నిందితుల్ని శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు జనసేన, వామపక్షనేతలు. అనంతపురంలో ఆటవిక రాజ్యం నడుస్తోందన్న విపక్షాలు పోలీస్ స్టేషన్‌పై దాడి చేస్తుంటే జిల్లా ఎస్పీ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. వైసీపీ కార్పొరేటర్ చంద్రశేఖర్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.

Next Story