By - Chitralekha |23 Aug 2023 9:05 AM GMT
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంస్థకి తర్లువాడ భూ కేటాయింపులపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే తర్లువాడ కొండను జనసేన బృందం పరిశీలించింది. వైసీపీ ప్రభు త్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విశాఖలో కొండలన్నీ కబ్జాకు గురవుతున్నాయంటూ ఆందోళన చేపట్టారు. అక్రమార్కులు కొండల్ని బోడిగుండు చేస్తున్నారం టూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తర్లువాడ లక్ష్మీనరసింహస్వామి తిరగాడిన కొండని, అలాంటి ఆధ్యాత్మిక కొండను కొట్టేయాలని అనుకోవడం దారుణమన్నారు
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com