కాకినాడలో ఏపీ విద్యుత్ ఉద్యోగుల ఆందోళన

కాకినాడలో ఏపీ విద్యుత్ ఉద్యోగుల ఆందోళన

జగన్ సర్కారు ఉక్కుపాదం మోపినా ఏపీ విద్యుత్ ఉద్యోగులు ఎక్కడా తగ్గడం లేదు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ కాకినాడలో ఆందోళన చేపట్టారు. పాదయాత్రలో జగన్ విద్యుత్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి రాగానే మాట తప్పి.. మడమ తిప్పిన నాయకుడు జగన్ అని ఆరోపించారు. ప్రభుత్వం మాట తప్పడం వల్లే తాము ధర్నాకు దిగామని తెలిపారు. సకాలంలో జీతాలు చెల్లించడంతో పాటు తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, డీఏలు తక్షణమే ఇవ్వాలని విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు.

Next Story