By - Vijayanand |30 Jun 2023 10:15 AM GMT
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రత్యేక పోస్టల్ కవర్ను ఆవిష్కరించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అబిడ్స్ డాక్ సదన్లో నిర్వహించిన కార్యక్రమంలో పోస్టల్ కవర్ను ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి, ప్రత్యేకతను ప్రస్పుటించేలా పోస్టల్ కార్డును విడుదల చేయడం అభినందనీయమన్నారు. తెలంగాణలో బౌద్ధ సంప్రదాయాన్ని ప్రతిబింబించే బావపూర్ కుర్రుపై పోస్ట్కార్డును విడుదల చేశారు. పోస్టల్ శాఖ ప్రజల జీవితాలతో భాగస్వామ్యమై సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగుతుందన్నారు. ఇదే సంప్రదాయాన్ని భవిష్యత్లో కొనసాగించాలని కిషన్ రెడ్డి సూచించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com