కొమురం భీం అడ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

కొమురం భీం అడ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

అసిఫాబాద్ జిల్లాలో 4 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు కుమురం భీం అడ ప్రాజెక్టులోకి వరద పోటెత్తుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందస్తుగా ప్రాజెక్టు 6 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. కొమురం భీం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 243 అడుగులు కాగా.. ప్రస్తుతం 237 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 7 వేల 521 క్యూసెక్కుల నీరు ఉండగా.. ఔట్‌ఫ్లో 12 వేల 54 క్యూసెక్కుల నీరు ఉందని అధికారులు తెలిపారు. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Next Story