తెలంగాణ సర్కార్ డబుల్‌ స్కెచ్‌

తెలంగాణ సర్కార్ డబుల్‌ స్కెచ్‌

తెలంగాణ సర్కార్ పకడ్బందీగా డబుల్‌ స్కెచ్‌ వేసింది. హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పంపిణీయే టార్గెట్‌గా పెట్టుకుంది. హైదరాబాద్‌ మంత్రులతో సమావేశమైన మంత్రి కేటీఆర్.. డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, పురోగతిపై చర్చించారు. నిర్మాణం పూర్తయిన 70 వేల డబుల్ బెడ్‌రూం ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఐదు విడతల్లో మొత్తం లక్ష ఇళ్లను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మీటింగ్‌కు మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మా రావు గౌడ్ హాజరయ్యారు.


Next Story